15 నుంచి బడ్జెట్‌ సమావేశాలు


హైదరాబాద్‌, మారి ్చ9 (జనంసాక్షి):

తెలంగాణ అసెంబ్లీ బ్జడెట్‌ సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. 2021-2022 బ్జడెట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మార్చి 15 నుంచి అసెంబ్లీ బ్జడెట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. 16న దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం ప్రకటిస్తారు. 17న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. 18న 11.30నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బ్జడెట్‌ ప్రవేశపెడతారు. ఈ బ్జడెట్‌ పేద ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి.