20 వరకు కంటివెలుగు పూర్తి

త్వరలో ఇఎన్‌టి,దంత పరీక్షలు

మెదక్‌,జనవరి31(జ‌నంసాక్షి): జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. జిల్లాలో చేపట్టిన కంటివెలుగు ఫిబ్రవరి 20 నాటికి కార్యక్రమం పూర్తవుతుందని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు తెలిపారు. మార్చి మెదటి వారం నుంచి ఈఎన్‌టీ, దంత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలు త్వరలో ఖరారు చేస్తామని పేర్కొన్నారు. కంటివెలుగు కార్యక్రమం వందరోజులు పూర్తయిందని అన్నారు. కొందరికి ఆపరేషన్లు చేశారని, త్వరలోనే శస్త్రచికిత్సలు చేయిస్తామన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఫిబ్రవరి 20 వరకు కొనసాగుతుందని, ఇంకా ఎవరైన కంటి పరీక్షలు చేయించుకొని వారు ఉంటే దగ్గరలో కొనసాగుతున్న కేంద్రాల్లో కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కంటి వెలుగుతో పాటు ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. జిల్లాలో మెరుగైన వైద్య సేవలను అందిస్తామని, ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.