21న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కేసీఆర్‌ భేటీ

– ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
హైదరాబాద్‌, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : డిసెంబర్‌ 7న ముందస్తు ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ జరగనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే తెరాస తమ అభ్యర్థులను ప్రకటించింది. కాగా ఈ నెల 21న మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల అవగాహన సదస్సు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు పాల్గోనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అభ్యర్థులతో స్వయంగా మాట్లాడుతారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా వ్యవహరించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై అభ్యర్థులకు ఈ సదస్సులో అవగాహన కల్పిస్తారు. పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థులు ఈ సమావేశంలో విధిగా పాల్గొనాలని పార్టీ ఆదేశించింది.