23న చలో గుంటూరు : అశోక్‌బాబు

కర్నూలు,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):   ప్రభుత్వానికి ఉద్యోగులు ఓటు బ్యాంకు కాదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి రాజకీయ నిర్ణయాలు అవసరం అన్నారు. సీపీఎస్‌ విధానంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు. సీపీఎస్‌ విధానం రద్దుకు డైరెక్ట్‌గా కమిటీ వేస్తే ప్రభుత్వాన్ని నమ్ముతామన్నారు. రాజ్యాంగ సవరణ చేసి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. ఔట్‌సోర్సింగ్‌ విధానం అంటే బానిసత్వానికి తెల్లచొక్కా వేసినట్లేనన్నారు. ఈనెల 23న ఛలో గుంటూరు కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. భవిష్యత్‌ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.