23కి చేరిన పుణె మృతుల సంఖ్య

మహారాష్ట్ర్ర(నెట్‌డెస్క్): పుణె జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. విపరీతంగా కురుస్తున్న వర్షం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. కొండ చరియల కింద మరి కొందరు మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు.