27న ముదిరాజ్‌ సభ

జనగామ,జూన్‌18(జ‌నం సాక్షి): ఈ నెల 27వ తేదీన జిల్లా కేంద్రంలో ముదిరాజ్‌ మహాసభను నిర్వహిస్తున్నామని, దీనిని జయప్రదం చేయాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌ నీల రాజు కోరారు.వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్‌లు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. మత్స్యకారుల అభ్యున్నతి కోసం అనేక పథకాలు రూపొందించడమే కాకుండా అమలు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుండి బీసీ-ఏ లోకి మార్చాలని, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను మత్స్యశాఖ సొసైటీకి అప్పగించాలని, 18 సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతీ ముదిరాజ్‌కు మత్స్య సోసైటీలో సభ్యత్వం కల్పించాలన్నారు. సభకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, అర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ రానున్నారని తెలిపారు.