27 న ఛలో ఢిల్లీ రైలు యాత్ర: కొణతాల

విశాఖపట్టణం,జనవరి23(జ‌నంసాక్షి): ఈ నెల 27 న ‘ ఛలో ఢిల్లీ రైలు యాత్ర ‘ చేపట్టనున్నట్లు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు. బుధవారం ఉదయం కొణతాల రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ… ‘ ఆంధ్రుల జన ఘోష ‘ పేరుతో ఈ రైలు యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. విభజన హావిూల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరపున ఈ పోరాటం చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్‌ చివరి సమావేశాల్లోనైనా ఎపి కి న్యాయం జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ యాత్ర తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.