30 లీటర్ల సారా పట్టివేత

జనం సాక్షి:కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి 2
కొల్లాపూర్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తాండ చెందిన ఎస్లావత్ మోత్యనాయక్
రత్లవత్ రాజానాయక్ అనే ఇద్దరూ పెంట్లవెల్లి మండలం యంగంపల్లి తండాకు చెందినవారు సమాచారం మేరకు
పరిసర ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున కొల్లాపూర్ ఎక్సైజ్ అధికారులు నాటు సారాను ద్విచక్ర వాహనము లో తరలిస్తుండగా దాడులు చేసి అదుపులోకి తీసుకున్నట్లు కొల్లాపూర్ ఎక్సైజ్ సి ఐ ఏడుకొండలు తెలియజేశారు.ఈ రూటు వాచ్ లో మోటార్ సైకిల్ పై అనుమానాస్పదం గా వేళ్ళుతున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి మోటార్ సైకిల్ పై వారు తరలిస్తున్న 30 లీటర్ల సారాను గుర్తించి సారాను స్వాధీనపరుచుకుని ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సిఐ ఏడుకొండలు తెలిపారు.సారా ను తరలిస్తున్న ఆ వ్యక్తుల యొక్క గ్లామర్, ఫ్యాషన్ షో ద్విచక్ర వాహనాలను పట్టుకొని సీజ్ చేసినట్లు ఆయన తెలియజేశారు.ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సై శంకర్, రజా హెడ్ కానిస్టేబుల్ చెన్న గౌడ్, మహేష్ ,నార్యా నాయక్ లు పాల్గొన్నట్లు సిఐ ఏడుకొండలు తెలియజేశారు.