31 వరకు లాక్ డౌన్ : సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. కాసేపట్లో అధికారులు, మంత్రులతో కలిపి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. సమావేశంలో రాష్ట్రంలో 31 వరకు లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మీటింగ్  తర్వాత 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేయనున్నారు. మరోవైపు  ప్రధాన నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు సీఎం కేసీఆర్ చప్పట్లు కొట్టనున్నారు.