4న కిషన్‌రెడ్డి ప్రచారం

మహబూబ్‌నగర్‌,మార్చి2(జ‌నంసాక్షి): మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైద్రాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ భాజపా అభ్యర్ధిగా రాంచందర్‌రావును గెలిపించాలని బిజెపి నేతలు కోరారు. ఆయన సమస్యలు తెలిసని వ్యక్తని అన్నారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో జిల్లాల సమస్యలను వినిపిస్తారని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పాలాది రాంమోహన్‌ కోరారు. ఈ నెల 4న జిల్లాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పర్యటించనున్నట్లు చెప్పారు. రాంచందర్‌ కోసం 4న కిషన్‌ రెడ్డి ప్రచారం చేస్తారని అన్నారు.