కారు ఢీకొని బాలిక మృతి

బాలానగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలోని విజయ టెక్స్‌టైల్స్‌ వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. రంగారెడ్డి గూడ శివారులోని సింగమ్మగూడ తండాకు చెందిన నిరోష రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనాస్థలానికి చేరుకున్న బాలానగర్‌ ఎస్సై మనోజ్‌ కుమార్‌ కారును పోలీస్‌ స్టేషన్‌కు తరలించి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం షాద్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు.