షాద్‌నగర్‌లో ఆర్టీఏ అధికారుల తనఖీలు

మహబూబ్‌నగర్‌ : షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని 23 ప్రైవేట్‌ బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. తనఖీ విషయం తెలసుకుని చెన్నై ,బెంగళూర్‌, నుంచి వస్తున్న కేశినేని ట్రావెల్స్‌ బస్సులను డ్రైవర్లు జడ్చర్ల వద్దే నిలిపివేశారు. ప్రయాణికులను జడ్చర్ల వద్దనే దింపివేసిన కేశినేని ట్రావెల్స్‌ వచ్చిన దారినే తిరుగుప్రయాణమయ్యాయి. కేశినేని ట్రావెల్స్‌పై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.