మాచారెడ్డి రచ్చబండలో విషాదం : వేదిక వద్ద మూడు నెలల పాప మృతి

నిజామాబాద్‌ : మాచారెడ్డి రచ్చబండ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. రచ్చబండ వేదిక వద్ద మూడు గంటలుగా వేచివున్న తల్లి ఒడిలోనే మోక్ష అనే మూడు నెలల పాప అసువులు బాసింది. బంగారుతల్లి పథకం కింద చెక్కును తీసుకునేందుకు మహిళ రచ్చబండ కార్యక్రమానికి వచ్చి చెక్కు ఇస్తారని వేచి చూస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కళ్లముందే కన్న కూతురు చనిపోవడంతో అ తల్లి రోదించే రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.