మహబూబ్‌ నగర్‌లో ఉత్సాహంగా పైకా పోటీలు

మహబూబ్‌నగర్‌, క్రీడలు: పైకా జాతీయ స్థాయి పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. వాలీబాల్‌ విభాగంలో పోటీలు క్వార్టర్‌ ఫైనల్‌ దశకు చేరుకున్నాయి. తైక్వాండో పోటీలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు మూడు పతకాలను సాధించింది. అథ్లుటిక్స్‌ విభాగంలో సాయంత్రం 100 మీ. 400 మీ. పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో 18 రాష్ట్రాల నుంచి 1200 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. పోటీలను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శర్మన్‌, అదనపు సంయుక్త కలెక్టర్‌ రాజారాం గురువారం పర్యవేక్షించారు.