పైకా వాలీబాల్‌ క్రీడలో ఛాంపియన్‌ ఆంధ్రప్రదేశ్‌

మహబూబ్‌ నగర్‌ (క్రీడలు) : మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పైకా జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో వాలీబాల్‌ అండర్‌-16 పోటీల్లో ఛాంపియన్‌గా ఆంధ్రప్రదేశ్‌ నిలవగా , ఉత్తరప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో గుజరాత్‌ విజేతగా, హర్యానా రన్నరప్‌ స్థానంలో నిలిచాయి. సాయంత్రం జిల్లా కేంద్రంలోని మైదానంలో నిర్వహించనున్న కార్యక్రమంలో మంత్రి డి.కె. అరుణ బహుమతి ప్రధానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.