మెదక్‌ జిల్లాకు మళ్ళీ కేసీఆర్

సంగారెడ్డి: ఎన్నికల ప్రచారంలో ఇతర పార్టీల కన్నా ముందుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు మరో విడత పర్యటనకు సమాయత్తమైంది. కేసీఆర్ నాలుగు రోజుల్లో 8 బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. టిఆర్ఎస్ నాయకుడు టి.హరీశ్ రావు ప్రకారం కేసీఆర్ ఏప్రిల్  21న దుబ్బాకలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఏప్రిల్ 24న మెదక్, నర్సాపూర్‌లో, ఏప్రిల్ 26న నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, జోగిపేట, సిద్ధిపేటలో జరిగే బహిరంగ సభల్లో టిఆర్ఎస్ అధినేత ప్రసంగిస్తారు. ఏప్రిల్ 27న సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని పటాన్‌చెరువులో ఏర్పాటు చేసే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.