శోభానాగిరెడ్డి కన్నుమూత

 

హైదరాబాద్(నెట్‌డెస్క్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి కన్నుమూశారు. గత రాత్రి ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఆళ్ల గడ్డ వద్ద కారు ప్రమాదానికి గురై ఆమె కోమాలోకి వెళ్లారు. ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రిలో చేర్పించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ఎప్పటికప్పుడు ప్రత్యేక వైద్య బృందం ఆమె ఆరోగ్యపరిస్థితిని సమీక్షించి వైద్యం అందజేసినా ఆమె వైద్యానికి స్పందించలేదు. తలకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిన ఆమె ఉదయం 11:05 గంటలకు మృతి చెందినట్లు కేర్ ఆసుపత్రి వైద్య బృందం ప్రకటించింది.