శోభ కుటుంబ సభ్యులకు ప్రముఖుల సంతాపం

హైదరాబాద్: హైదరాబాద్(నెట్‌డెస్క్): వైఎస్సార్సీ‌పీ నేత శోభానాగిరెడ్డి మృతి పట్ల పలువురు నేతలు ఆమె కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. కేర్ ఆసుపత్రికి చేరుకుని సంతాపం తెలిపారు. పరామర్శించిన వారిలో మాజి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ, మాజీ డిజిపి దినేష్ రెడ్డి, చిరంజీవి, కిషన్ రెడ్డి, రేణుకా చౌదరి తదితరులు ఉన్నారు. పలువులు సినీ తారలు కూడా కేర్ ఆసుపత్రికి చేరుకుని భూమా కుటుంబాన్ని పరామర్శించారు.