ధాన్యం కొనుగోలు చేసి పరారైన వ్యాపారి

మహబూబ్‌నగర్: ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటను ఓ దూర్తుడు కొల్లగొట్టాడు. ఇటిక్యాల మండలం వల్లూరులో శ్రీధర్‌రెడ్డి అనే వ్యాపారి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి పత్తా లేకుండా పోయాడు. దీంతో రైతన్నలు లబోదిబో మంటూ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. వ్యాపారి తమ వద్ద నుంచి రూ.7 కోట్ల మేర వేరు శనగ కొనుగోలు చేసి పారిపోయాడని ఫిర్యాదు చేశారు.