సీమాంధ్ర ఉద్యోగులను హెచ్‌వోడీలుగా నియమించవద్దు : శ్రీనివాస్‌గౌడ్

 మహబూబ్‌నగర్, మే 10 : తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రా ఉద్యోగులను హెచ్‌వోడీలుగా నియమించవద్దని టీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. అలా నియమిస్తే ప్రచ్ఛన్న యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు ఆంధ్రా అధికారిని నియమించడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన శ్రీనివాస్ ఇది విఘ్నులు చేయాల్సిన పనికాదన్నారు. అకాల వర్షాలతో పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాల్లో మునిసిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికస్థానాలు టీఆర్ఎస్‌వే అని శ్రీనివాస్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు