హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు ర‌ట్టు

హైదరాబాద్: నగరంలో ఓ డ్రగ్స్ ముఠా గుట్టు రైట్టెంది. నగర శివారులోని హయత్‌నగర్ కేంద్రంగా బ్రౌన్ షుగర్ సరఫరాను కొనసాగిస్తోన్న ముఠాను నార్కొటిక్స్, ఎస్‌వోటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. బాచారం, బండ రావిరాల, గండిచెరువు తదితర ప్రాంతాల్లో డ్రగ్స్ తయారీ గోడౌన్‌లపై ఏకసమయంలో దాడులు చేసి పెద్ద ఎత్తున బ్రౌన్‌షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల సందర్భంగా 15 మందిని అరెస్టు చేశారు. వారం రోజులుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ముఠా సభ్యులు డ్రగ్స్ తరలిస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు.