పాఠశాలల బస్సుల తనిఖీల్లో ఆర్టీఏ అధికారులు

ఇప్పటివరకు 148 బస్సులపై కేసులు నమోదు
హైదరాబాద్: ఆర్టీఏ అధికారులు పాఠశాలల బస్సుల తనిఖీల్లో ఇప్పటివరకు 148 బస్సులపై కేసులు నమోదు చేశారు. మరో 20 బస్సులను సీజ్ చేశారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే డ్రైవర్ల లైసెన్స్ రద్దు చేయాలని ఆర్టీఏ నిర్ణయించింది. ఈ మేరకు తనిఖీల్లో పట్టుబడిన డ్రైవర్ల లైసెన్స్‌లను రద్దు కూడా చేశారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా ఈ నెల 27న అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. రైల్వే గేటు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహనను కల్పించనున్నారు.