ఐసీసీ నిర్ణయంపై బీసీసీఐ అసంతృప్తి
ముంబయి: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా- ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ వివాదంలో ఐసీసీ వెలువరించిన తీర్పుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ వివాదంలో రవీంద్ర జడేజా ఎలాంటి తప్పు చేయలేదని బీసీసీఐ తెలిపింది. జడేజాకు పూర్తి మద్దతు ప్రకటించింది. మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని అప్పీలు చేయనున్నట్లు వెల్లడించింది. నాటింగ్ ¬మ్లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో జడేజా, అండర్సన్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీనిపై బీసీసీఐ నేరుగా ఐసీసీకి ఫిర్యాదు చేసిన సంగతి విదితమే.