90 నిమిషాల్లో 20వేల కోట్ల నష్టం

చైనాకు చెందిన ఓ డెయిరీ వ్యాపారి కేవలం 90 నిమిషాల్లోనే రూ.20,770కోట్లు నష్టపోయారు. చైనాలోని ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన యాంగ్‌కైకి చెందిన చైనా హ్యుషన్ డెయిరీ హోల్డింగ్స్ కంపెనీ షేర్లు భారీ పతనం చవిచూడటంతో ఈమేరకు భారీ నష్టం చవిచూశారు. ఆయన ఆస్తి విలువ మొత్తం రూ.24120 కోట్లు కాగా, తాజా పరిణామంతో ఆయన ఆస్తి విలువ ఒక్కసారిగా రూ.3350కోట్లకు పడిపోయింది. అయితే, షేర్లు పతనం కావడానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు.