MPDO&AO గార్లను సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు

శుక్రవారం రోజున గోవిందరావుపేట మండల అధ్యక్షులు మద్దినేని తేజరాజు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు ములుగు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ చింతలపూడి భాస్కర్ రెడ్డి
మండల ఎంపీడీవో మరియు మండల అగ్రికల్చర్ ఆఫీసర సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరుతూ దరఖాస్తు ఇవ్వడం జరిగినది. ఈ దరఖాస్తు ద్వారా 2014 -15 ఆర్ధిక సంవత్సరం నుండి జూన్ 30 2022 వరకు మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో చేపట్టిన అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం చెల్లించిన బిల్లులు ఇంకా చెల్లించాల్సిన బకాయిల బిల్లుల వివరాలు అలాగే గ్రామ పంచాయతీలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన బిల్లులు చెల్లించాల్సిన బకాయిలను గ్రామాల నుండి కొత్త పెన్షన్ కోసం చేసుకున్న దరఖాస్తు వివరాలు మంజూరైన లబ్దిదారుల సంఖ్య వివరాలు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు పి ఎన్ జి ఎస్ వై ద్వారా కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి ఇచ్చిన నిధులు గ్రామాల్లో చేపట్టిన ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వంఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు గ్రామాల్లో వైకుంఠధామం నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ధోబి ఘాట్ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా నిధుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలు రైతు వేదికలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలను కోరుతూ దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తకాలపల్లి దేవేందర్ ఏనుగు రవీందర్ రెడ్డి కర్ర సాంబశివరావు,నగరపు రమేష్, జీనకాల కృష్ణకరిరావు, దొంతి రెడ్డి వాసు దేవా రెడ్డి,కొత్త సుధాకర్,బద్ధం జనార్దన్, బైరి మహీందర్ రెడ్డి,గట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area