బంగ్లాకు ఎదురుదెబ్బ!
– గాయంతో మ్యాచ్కు దూరమైన షకీబ్ అల్ హసన్
దుబాయ్, సెప్టెంబర్27(జనంసాక్షి) : ఆసియా కప్ ఫైనల్ ముందు బంగ్లాదేశ్ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. వేలి గాయం కారణంగా ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ తుది సమరానికి దూరమయ్యాడు. గాయం కారణంగా పాకిస్థాన్తో జరిగిన కీలక మ్యాచ్లోనూ ఆడని షకీబ్ ఢాకా బయల్దేరి వెళ్లాడు. నాలుగు వారాల నుంచి ఆరు వారాలపాటు షకీబ్ జట్టుకు దూరం అవుతాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ అక్రమ్ ఖాన్ తెలిపాడు. గత కొద్ది రోజులుగా వేలి నొప్పి ఎక్కువైంది. ఫిజియో ప్రయత్నించినా నొప్పి ఇంకా ఎక్కువైంది. నొప్పితోనే తొలి నాలుగు మ్యాచ్లు ఆడిన షకీబ్కు థ్యాంక్స్ అని ఖాన్ తెలిపాడు. గాయం కారణంగా సెప్టెంబర్ 30నుంచి జింబాబ్వేతో సొంత గడ్డ విూద ప్రారంభం కానున్న సిరీస్కు కూడా షకీబ్ దూరమైనట్టే. బుధవారం జరిగిన కీలక మ్యాచ్లో పాకిస్థాన్పై 37 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో బంగ్లా జట్టు ఫైనల్ చేరింది. భారత్, బంగ్లా మధ్య శుక్రవారం ఫైనల్ పోరు జరగనుంది.
ఆసియా కప్ ఫైన్లో..
Other News
- కేంద్ర పథకాలపైనా.. తెదేపా స్టిక్కర్లు వేస్తున్నారు
- జగన్కు పదవులకంటే ప్రజలే ముఖ్యం
- ప్రతీఒక్కరూ సమాజసేవలో.. భాగస్వాములు కావాలి
- సీఎం ¬దాలో.. బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేసీఆర్
- నదీజలాల పంపిణీలో ఒప్పంద ఉల్లంఘనలు సహించం
- ప్రధాని మోడీకి కొరియా శాంతి పురస్కారం
- జమ్మూ జైల్లోనుంచి పాక్ తీవ్రవాదుల తరలింపు
- 27న ఎన్డీయేతర పక్షాల భేటీ
- కశ్మీరులపై దాడులు జరగకుండా.. చర్యలు తీసుకోండి
- రూ. 1,82,017కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్