కోడిపందాలకు బ్రేక్‌

kodipandaluహైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా ఎపిలో నిర్వహిస్తున్న కోడిపందాలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. ఇకపై కోడిపందాలు జరక్కుండా తగుచర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కోడిపందాల పేరుతో మద్యం, జూదం విచ్చలవిడిగా జరుగుతోందని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగరాధన్‌, జస్టిస్‌ ఎ.శంకరనారాయణలతో కూడిన డివిజన్‌బెంచ్‌ ఈ ప్రజాహిత వ్యాఖ్యంపై సోమవారం మరోసారి విచారన చేపట్టి ఈమేరకు తీర్పును వెలువరించింది.