గద్వాలను జిల్లా చేయకపోతే ఆమరణ దీక్ష

dkaమహబూబ్‌నగర్‌ : గద్వాలను జిల్లాగా ప్రకటించకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ… గద్వాల జిల్లా ఏర్పాటుపై సీఎం కేసీఆర్ పునరాలోచించుకోవాలన్నారు. అన్ని అర్హతలు ఉన్న గద్వాలను ఎందుకు దూరం పెడుతున్నారో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే కొత్త జిల్లాల నోటిఫకేషన్‌లో గద్వాల పేరు లేకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని ఆమె ప్రకటించారు.