జాతిపితకు గవర్నర్‌, సీఎం నివాళి

bapu-nivali

హైదరాబాద్‌,అక్టోబర్‌ 2(జనంసాక్షి):జాతిపిత  మహాత్మా గాంధీ  జయంతిని పురస్కరించుకుని లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌లో అయనకు అంజలి ఘటించారు. పలువురు ప్రముఖులు బాపూఘాట్‌లోని గాంధీ మహాత్ముని విగ్రహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి  నివాళులర్పించారు. గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ,  రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ , శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి , నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు మహాత్మునికి అంజలి ఘటించిన వారిలో ఉన్నారు.