తుపాకి పేలి కెరమెరి ఎస్‌ఐ మృతి

221ఆదిలాబాద్‌: తుపాకి పేలి ఆదిలాబాద్‌ జిల్లా కెరమెరి ఎస్‌ఐ శ్రీధర్‌(27) మృతి చెందారు. తుపాకి ప్రమాదవశాత్తూ పేలిందా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం 9.30గంటల సమయంలో పోలీసు క్వార్టర్స్‌లో రక్తపు మడుగులో శ్రీధర్‌ మృతదేహాన్ని గుర్తించిన పని మనిషి పోలీసులకు సమాచారమందించడంతో విషయం వెలుగు చూసింది. 3 నెలల నుంచి కెరమెరిలో శిక్షణ ఎస్‌ఐగా పనిచేసిన శ్రీధర్‌ రెండ్రోజుల క్రితమే ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించారు.