ఏలూరు,మే4(జనంసాక్షి): ప్రముఖ సినిమా దర్శకులు దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా.. శనివారం పాలకొల్లులోని దాసరి విగ్రహానికి మాజి మంత్రి చేగొండి హరి రామజోగయ్య పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా హరి రామజోగయ్య మాట్లాడుతూ.. దర్శకునిగా, నిర్మాతగా, నటుడిగా దాసరి నారాయణరావు గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించి.. రాజకీయంగా కూడా ఎదిగి, ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. పాలకొల్లు పేరు ప్రతిష్టలు ప్రపంచానికి తెలియజేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజి ఎంఎల్సి మేకా శేషుబాబు, పాలకొల్లు జనసేన అభ్యర్థి గున్నం నాగబాబు, డాక్టర్ కెఎస్పిఎన్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.
Other News
- ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక
- ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తే తిరిగికక్కిస్తాం
- బస్తీ దవాఖానాలకు మహర్దశ
- నల్ల చట్టాల రద్దు మినహా ప్రత్యామ్నాయం లేదు
- గొగొయ్కు జడ్ ప్లస్ భద్రత
- శశికళ సీరియస్
- ధరణిపై స్టే పొడగింపు
- నీతి ఆయోగ్ సీఎం కేసీఆర్తో భేటి
- అర్నబ్ తో జాతీయ భద్రతకు ముప్పు
- ఎట్టకేలకు.. టీకా వేయించుకునేందుకు మోదీ ముందుకు