సాగర్కు కొనసాగుతున్న వరద

నల్గొండ : నాగార్జునసాగర్కు వరద ఉధృతి కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా,  ప్రస్తుత నీటిమట్టం 514.50 అడుగులకు చేరినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇన్ఫ్లో 22,330 క్యూసెక్కులు కాగా… ఔట్ఫ్లోలో 22,330 నీరు ఉందని వారు వెల్లడించారు.

అలాగే శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుత నీటిమట్టం 873 అడుగులు కాగా… నీటి నిల్వ 155 టీఎంసీలు ఉంది. అయితే ఇన్ఫ్లో 16 వేల క్యూసెక్కులు కాగా… ఔట్ఫ్లోలో 26,501 నీరు ఉంది