సాగర్ ఎడమకాల్వకు నీరు విడుదల

నల్గొండ: నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు నీరు విడుదలైంది. గురువారం ఉదయం మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. మొదటి జోన్ పరిధిలోని ఆరు తడి పంటలకే నీటిని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ రోజుకు 8 వేల క్యూసెక్కులు విడుదల చేయనున్నామని, ఎఎమ్మాఆర్ ప్రాజెక్టు పరిధిలోని చెరువులు నింపుతామని తెలిపారు.