ఆర్థిక సంక్షోభంతో అంధకారంలోకి శ్రీలంక


` దేశంలో రోజుకు పది గంటలపాటు కరెంట్‌ కట్‌
` నిత్యావసరాల కోసం కిలోవిూటర్ల కొద్దీ బారులు.
` ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు..
కొలంబో,మార్చి 30(జనంసాక్షి): పెట్రోల్‌ నుంచి కూరగాయల దాకా.. నిత్యావసరాల కోసం కిలోవిూటర్ల కొద్దీ బారులు..ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు.. విద్యుద్దీపాలు వెలగక చీకట్లో మగ్గుతున్న ప్రజలు.. ద్వీప దేశం శ్రీలంకలో ఎటు చూసినా కన్పిస్తోన్న దృశ్యాలివే. ఆహార, ఆర్థిక సంక్షోభంతో సింహళ దేళం అల్లాడిపోతోంది. విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోవడంతో కీలక దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో అత్యవసరాలు, నిత్యావసరాలు.. ఇలా అన్నింటా కొరత ఏర్పడిరది.ఇంధన కొరత కారణంగా శ్రీలంకలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సరిపడా విద్యుత్‌ లేక కరెంట్‌ కోతలు మొదలయ్యాయి. తాజాగా ఈ కోతల సమయాన్ని మరింత పెంచుతూ లంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 7 గంటల పాటు కరెంట్‌ సరఫరా నిలిపివేస్తుండగా.. బుధవారం నుంచి దాన్ని 10 గంటలకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే దేశవ్యాప్తంగా రోజుకు 10 గంటల పాటు కరెంట్‌ కోతలు ఉండనున్నాయి.ఇంధనం సరిపడా లేక హైడ్రో ఎలక్ట్రిసిటీ కొరత ఏర్పడిరది. భారత్‌ సహకారంతో డీజిల్‌ను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ అది అత్యవసర సేవలు, పవర్‌ స్టేషన్లకే సరిపోతుందని శ్రీలంక విద్యుత్‌ శాఖ మంత్రి వెల్లడిరచారు. విద్యుత్‌ కోతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగక అనేక నగరాలు అంధకారంగా కన్పిస్తున్నాయి. రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు క్యాండిల్‌ వెలుతురులో వ్యాపారాలు సాగిస్తున్నారు.సంక్షోభం కారణంగా అత్యవసర ఔషధాల నుంచి సిమెంట్‌ వరకూ అన్ని వస్తువుల కొరత ఏర్పడిరది. ఆసుపత్రుల్లో మందులు లేక సాధారణ శస్త్రచికిత్సలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అటు ఇంధన కొరత కారణంగా రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. పేపర్‌ కొరతతో విద్యా సంస్థలు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేశాయి. పెట్రోల్‌తో పాటు కూరగాయాల కోసం కూడా ప్రజలు బారులు తీరాల్సిన స్థితి ఎదురైంది. గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చుని కొందరు స్పృహ కోల్పోతుండగా.. ఇప్పటివరకు ముగ్గురు మరణించినట్లు తెలిసింది. ఏడు దశాబ్దాల్లో ఇటువంటి సంక్షోభ పరిస్థితులను చవిచూడలేదని లంకేయులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.పర్యాటక దేశంగా పేరొందిన శ్రీలంకలో 2019లో ఈస్టర్‌ పండగ నాడు ఓ చర్చిలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన ఆ దేశ పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో దిగుమతులపై నిషేధం విధించారు. ఫలితంగా చమురు, నిత్యావసరాల కొరత ఏర్పడి వాటి ధరలు ఆకాశాన్నంటాయి.