ఆస్టేల్రియా 298/5.. లంకతో రెండో టెస్టు

గాలె,జూలై9 ( జనంసాక్షి):  స్టీవ్‌ స్మిత్‌ (109 బ్యాటింగ్‌), లబుషేన్‌ (104) శతకాలతో విజృంభించడంతో
శ్రీలంకతో రెండో టెస్టులో ఆస్టేల్రియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. స్మిత్‌, లబుషేన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో తొలిరోజు శనివారం ఆట ముగిసేసరికి 5 వికెట్లకు 298 పరుగులు చేసింది. స్మిత్‌కు తోడుగా అలెక్స్‌ క్యారీ (16 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. కెరీర్‌లో 28వ టెస్టు సెంచరీ సాధించిన స్మిత్‌, లబుషేన్‌తో కలిసి మూడో వికెట్‌కు 134 పరుగులు జోడిరచాడు. ఓపెనర్లలో ఖవాజ (37) తక్కువస్కోరుకే వెనుదిరగగా, వార్నర్‌ (5) పూర్తిగా నిరాశపరిచాడు. లంక బౌలర్లలో ప్రబత్‌ జయసూర్య మూడు, కసున్‌ రజిత, రమేశ్‌ మెండిస్‌ చెరో వికెట్‌ తీశారు.