ఇంటింటికి ‘వైఎస్సార్ టిపి’ కరపత్రాల పంపిణీ..

దేవరుప్పుల జూన్ 25 (జనం సాక్షి):
దేవరుప్పుల మండలం, పెద్దమడూరు గ్రామంలో ఉపాధి హామీ పని చేసే వారి దగ్గరికి వెళ్లి ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కరపత్రాల ప్రచార కార్యక్రమం చేసిన జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది శ్రీహరి
వైఎస్ఆర్ హయాంలో ఉపాధి హామీ కూలీలకు రెండు వందల రూపాయలు వచ్చాయని..
ఇప్పుడు కనీసం అరవై రూపాయలు కూడా రావడం లేదని..
ఆవేదన వ్యక్తం చేస్తున్నారని..
వైయస్సార్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని..
108,104, రైతు రుణమాఫీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాడని..
ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని..
ఇవన్నీ రావాలి అంటే మళ్ళీ తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ  పాలన రావాలని..
కెసిఆర్ పాలన పోవాలని..
అది షర్మిల అక్క తోనే సాధ్యమని..
వైయస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రజలందరూ ఆదరించాలని..
అన్నారు.
ఈ కార్యక్రమంలో గునిగంటి కుమార్, వెంకన్న, నరేష్, దయాకర్,  తదితరులు పాల్గొన్నారు.