ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి

ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని బోథ్ పట్టణ అధ్యక్షుడు సల్ల రవి అన్నారు.శనివారం బోథ్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని
శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి పురస్కరించుకొని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమె చేసిన సేవలను స్మరిస్తూ గతంలో నెహ్రూ తర్వాత అత్యంత జన ఆదరణ పొందిన ప్రధానిగా ఇందిరా గాంధీ ఉన్నారని అన్నారు.గరీబీ హటావో, అలాగే ప్రైవేటు బ్యాంకుల్ని ప్రభుత్వ పరం చేయడం లాంటి ఎన్నో సాహో సోపేతమైన  నిర్ణయాలు తీసుకొని ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని అన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు చేసి  ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని పేర్కొన్నారు.
 ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ బాయ్ , బోథ్ మండల అధికార ప్రతినిధి  యండి అబ్రహార్ ,
 సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల,
 మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ రైముద్దీన్  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  రాజశేఖర్,
తబ్రేజ్ బేగ్  అద్నాన్, సయ్యద్ ముస్తఫా, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.