ఈ నెల 17 నుండి పెనుబల్లి రామాలయంలో ధనుర్మాస పూజలు

పెనుబల్లి, డిసెంబర్ 14(జనం సాక్షి)   పెనుబల్లి శ్రీకోదండరామాలయంలొ డిసెంబర్ 17 నుండి ధనుర్మాస పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు, ఈ నెల 16 నుండి ప్రారంభమగు ధనుర్మాసం సందర్బంగా ప్రతీరోజు తిరువారదన కైంకర్యములు డిసెంబర్ 17  నుండి జనవరి 14  వరకు ఆలయంలొ రోజు ఉదయము గం.5:30నిలకు తిరుప్పావై సేవా, శ్రీగోదారంగనాథ అష్టోతరములు, మహామంగళారతి పాశురవిన్నపం జరుగును కావున భక్తాదులందరు రోజు ఆలయంకు విచ్చేసి తీర్థగోష్ఠిలొపాల్గొని స్వామి వారి అమ్మవారి కృపాకటాక్షాలు పొం దాలని శ్రీకోదండరామాలయం  అర్చకులు కోరారు.