ఉత్తమ రైతులకు అవార్డులు ఇవ్వాలి

కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి):75 వ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా అన్ని శాఖల అధికారులకు ఉద్యోగులకు, ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ మండలాల అవార్డు ప్రశంసాపత్రాలను ఇచ్చారని, కానీ ఉత్తమ రైతులు అని మండలానికి ఒకరి చొప్పున సన్మానం చేస్తే బాగుండేదని కామారెడ్డి జిల్లా తెరాస పార్టీ ఉపాధ్యక్షుడు ఏలేటి భుంరెడ్డి అన్నారు. మంగళవారం విూడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.