ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరవ్వాలి

ఎంఈవో  కృష్ణయ్య
ఆళ్లపల్లి జూన్ 25 జనం సాక్షి
ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరవ్వాలని ఎంఈవో పి. కృష్ణయ్య అన్నారు శనివారం  నడిమిగూడెం పంచాయితీ సంధిబంధంలోని మన ఊరు మన బడి పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించారు .అనంతరం రికార్డులను పరిశీలించారు ఉపాధ్యాయులు బోధనల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయులు ప్రతిరోజు సమయపాలన పాటించాలని అన్నారు. విద్యార్థులకు క్షుణ్నంగా అర్థమయ్యే విధంగా బోధన చేయాలని అన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం బొజ్య తదితరులు పాల్గొన్నారు