ఎమ్మెల్యేను కలిసిన గ్రామ అభివృద్ధి కమిటీ

ఎమ్మెల్యేను కలిసిన గ్రామ అభివృద్ధి కమిటీఎమ్మెల్యేను కలిసిన గ్రామ అభివృద్ధి కమిటీ
మెట్ పల్లి టౌన్, డిసెంబర్ 02, జనం సాక్షి:మెట్పల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇబ్రహీంపట్నం మండలం గోధూరు గ్రామ అభివృద్ధి కమిటీ కార్యవర్గం సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును మెట్ పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి సన్మానించారు. ఇటీవలే నూతనంగా ఎన్నికైన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు బూరం సంజీవ్, కమిటీ సభ్యులు గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సంగ శ్రీనివాస్, క్యాషియర్ గడ్డం స్వామి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.