ఎమ్మెల్సీలు అభ్యర్థులుగా పట్నం,శంభీపూర్‌ నామినేషన్లు

రంగారెడ్డి,నవంబర్‌22(జనం సాక్షి): రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌లో మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, ప్రకాశ్‌ గౌడ్‌ పాల్గొన్నారు. జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తున్నది. ఆరు స్థానాలకు బరిలో ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు. దీంతో ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులు ఇద్దరే ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు.