ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో తనయుడకి కంటి చికిత్స

నేడు హైదరాబాద్‌కు ప్రియాంక
హైదరాబాద్‌,నవంబర్‌ 23 జనంసాక్షి :కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం తన కుమారుడు రైహాన్‌ సహా హైదరాబాద్‌కు వస్తున్నారు. రైహాన్‌ కంటి గాయానికి హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో చికిత్స చేయించనున్నారు. నాలుగున్నరేళ్ల కిందట రైహాన్‌ క్రికెట్‌ ఆడుతుండగా కంటికి దెబ్బ తగిలింది. ఢల్లీి ఎయిమ్స్‌ వైద్యులు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అప్పట్లో హైదరాబాద్‌లో చికిత్స పొందిన రైహాన్‌ను మరోసారి తీసుకువస్తున్నారు. చికిత్స అనంతరం బుధవారం సాయంత్రం ఢల్లీి తిరుగు పయనం కానున్నారు. ప్రియాంకగాంధీ, రాబర్ట్‌ వాద్రా దంపతులకు కుమారుడు రైహాన్‌, కుమార్తె మిరాయా ఉన్నారు. రైహాన్‌ పూర్తి పూర్తిపేరు రైహాన్‌ రాజీవ్‌ వాద్రా. రైహాన్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌గా చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.