ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి గా పల్లా దేవేందర్ రెడ్డి ఎన్నిక

యాదగిరి గుట్టలో నవంబరు 27-28-29 తేదీలలో జరిగిన ఏఐటీయూసీ  తెలంగాణా రాష్ట్ర మూడవ మహాసభలో ఏఐటీయూసీ  రాష్ట్ర కార్యదర్శి గా పల్లా దేవేందర్ రెడ్డి ఎన్నిక కావడం జరిగింది. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ జిల్లాలో నిత్యం ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుంది. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం   ఏఐటీయూసి అండగా నిలిచి పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.