ఓటు నమోదుపై అవగాహన

ఓటు నమోదుపై అవగాహన

రాజాపేట, డిసెంబర్2 ( జనంసాక్షి): మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ కళాశాలలో ఓటు హక్కు నమోదు అవగాహన కార్యక్రమం ప్రిన్సిపల్ సోమసాని సురేందర్ అధ్యక్షతన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి మండల తహశీల్దార్ రవి కుమార్ అధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ యువతి యువకులు 18 సంవత్సరాల నిండిన వారు ఎవరైనా ఓటర్ నమోదు కార్యక్రమం చేసుకోవాలని తహశీల్దార్ విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు గుఱ్ఱం.పాండు,నగేష్, కర్ణా కర్,కృష్ణ,రాజు,పున్రాజ్,ప్రశాంత్,లావణ్య,అనిల్,శ్రీను, శ్రావణ్,అశోక్,కంప్యూటర్ ఆపరేటర్ శేఖర్,విఅర్ఎ చంద్రకళ,కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.