కాబూల్‌లో 150మంది బారతీయుల కిడ్నాప్‌

ఎయిర్‌పోర్టు సవిూపంలో తాలిబన్ల కిరాతకం
అయితే వారంతా క్షేమంగానే ఉన్నారన్న కేంద్రం
కాబూల్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): అప్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయాల్లో సోదాలు జరిపిన తాలిబన్లు..కీలక డాక్యుమెంట్లు, కార్లను తమ వెంట పట్టుకెళ్లడం తెలిసిందే. తాజాగా తాలిబన్లు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. విమానాశ్రయంలో ఎదురు చూస్తున్న 150 మందికి పైగా భారతీయులను కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. వీరందరని తాలిబన్లు శనివారం కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌ సవిూపంలో కిడ్నాప్‌ చేశాసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కాబుల్‌లోని భారత ఎంబసీకి చెందిన ఓ అప్గన్‌ ఉద్యోగి వెల్లడిరచారు. తాలిబన్లు కిడ్నాప్‌ చేసిన వారిలో ఇతర దేశాలకు చెందినవారు కూడా ఉన్నట్లు సమాచారం. తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులకు తక్షణ ప్రమాదం ఏం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. భారతీయులను తాలిబన్లు కిడ్నాప్‌ చేసినట్లు ది న్యూయార్క్‌ టైమ్స్‌కు చెందిన రిపోర్టర్‌ ఒకరు ట్వీట్‌ చేశారు. సవిూపంలోని పోలీస్‌ స్టేషన్‌లో కిడ్నాప్‌ చేసిన భారతీయులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వీరిని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం బ్యాక్‌ చానెల్‌ ద్వారా చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇక భారతీయ వైమానికి దళానికి చెందిన సీ`130జే విమానం కాబూల్‌ నుంచి దాదాపు 85 మంది భారతీయులను తరలించిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. వీరంతా ఇండియా వెళ్లడం కోసం ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే కాబూల్‌ లో ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నారని కేంద్రం ప్రకటించింది. మధ్యాహ్న భోజనం చేసి వారంతా కాబూల్‌ ఎయిర్‌ పోర్టుకు బయలుదేరాని స్పష్టం చేసింది. అధికారులు వారితో టచ్‌ లో ఉన్నారని తెలిపింది. వారందరిని సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చింది. ఉదయం వంద నుంచి 150 మంది భారతీయులను తాలిబాన్లు కిడ్నాప్‌ చేశారని అఎª`గాన్‌ విూడియాలో కథనాలు వచ్చాయి. ఐతే భారతీయులందరూ క్షేమంగా
ఉన్నట్లు స్థానిక రిపోర్టర్లు స్పష్టం చేశారు. వారందరిని కాబూల్‌ ఎయిర్‌ పోర్టుకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు.