కృతజ్ఞత సభకు భారీగా తరలి మున్నూరు కాపులు

చండ్రుగొండ  జనంసాక్షి (జూన్ 18) : రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన  గాయత్రి రవి, బండి పార్థసారథిరెడ్డి, ల కోసం ఖమ్మంలో  తలపెట్టిన   కృతజ్ఞత సభ కు శనివారం  మండల కేంద్రం నుండి మున్నూరుకాపు కులస్థులు   భారీగా తరలివెళ్లారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ మున్నూరుకాపుల ను గుర్తించారన్నారు. వారికి రుణపడి ఉంటామన్నారు.ఖమ్మం తరలివెళ్ళిన వారిలో సంఘం   సభ్యులు  లంక నర్సింహారావు పులి సత్యం ఆకుల శ్రీనివాసరావు రమేష్, రాము, పసుపులేటి వెంకటేశ్వర్లు   తదితరులు ఉన్నారు