కెసిఆర్‌ రైతు సంక్షేమ కార్యక్రమాలను తెలపాలి

అధికారులు, ప్రజాప్రనిధులు ఈ బాధ్యత తీసుకోవాలి

సిసిఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

జనగామ,నవంబర్‌11(జనంసాక్షి): రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నదే సీఎం కెసిఆర్‌ లక్ష్యం అని ని పంచాయితీజార్‌ శాఖ ఎర్రబెల్లి దయాకర్‌ రావుచెప్పారు. రైతులు రాజులు కావాలని కెసిఆర్‌ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దళారులు లేకుండా, రైతులకు గిట్టుబాటు ధరలు లభించాలనన్నదే ప్రభుత్వం యత్నమని అన్నారు. రైతుల సంక్షేమం కోసమే రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి వివరించారు. ఇవన్నీ రైతాంగానికి తెలిపే బాధ్యతని ప్రజా ప్రతినిధులు తీసుకోవాలన్నారు. అధికారులు కూడా ప్రభుత్వ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గం లింగాలఘనపూర్‌ మండలం పటేల్‌గూడెం క్రాస్‌ రోడ్‌లో సిసిఐ ద్వారా పాలకుర్తి మండలా నికి చెందిన పత్తి కోనుగొలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ సీఎం కేసిఆర్‌ రైతుల పక్షపాతి అన్నారు. అలాగే నేల పోగుల క్రాస్‌ రోడ్‌ లో గల వెంకట సాయి జిన్నింగ్‌ మిల్లులో సిసిఐ ద్వారా కొడకొండ్ల, దేవరుప్పుల మండలాలకు చెందిన పత్తి కోనుగొలు కేంద్రాన్ని, చిల్పూరు మండలం రాజవరంలో జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి ప్రారంభించారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు, మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల పంటలను కొనుగోలు చేస్తామని, గిట్టుబాటు ధరలు కల్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఆఖరు గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు తమ పంటలను నిర్ణీత నిబంధనల ప్రకారం తాలు, తేమ లేకుండా మార్కెట్ల కు తీసుకురావాలన్నారు. రైతులను మోసం చేస్తే, దళారుల పని పడతామని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. కరోనా విజృంభించే అవకాశాలు కనిపి స్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. రైతులు కూడా మార్కెట్లలో నిబంధనల ప్రకారం కోవిడ్‌ నివారణ కు వీలుగా, మసలుకోవాలి మంత్రి పిలుపునిచ్చారు. మిల్లర్లు కూడా ముందుగా రైతుల ధాన్యాలు, పత్తి ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.