కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి…

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
.. బచ్చన్నపేట లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
బచ్చన్నపేట జూన్ 25 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుంది అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు శనివారం మండల కేంద్రంలో వ్యవసాయానికి సంబంధించిన యూరియా నిల్వచేసే గోదామును మరియు స్మశాన వాటిక కు సీసీ రోడ్డును ప్రారంభించారు అనంతరం పిఎసిఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణ చందర్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూ దేశంలోనే రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెన్షన్లు ఏ రాష్ట్రం ఇవ్వలేదని ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఇస్తుందని ఇది కేసీఆర్ గొప్పతనం కాదు అని అన్నారు అదేవిధంగా ఒకప్పుడు రాష్ట్రంలో కరెంట్ పోతే వార్త ఇప్పుడు కరెంటు ఉంటే వార్త అయిందని ఒకప్పుడు త్రాగునీటికి వ్యవసాయ రంగానికి నీరు లేక ప్రజలు అల్లాడిపోయారు ఇప్పుడు కలలో కూడా ఎవరు ఊహించని విధంగా రాష్ట్రానికి పుష్కలంగా నీరు అందించిన అపర భగీరథుడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటనే ఉంటారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు . ఇర్రీ రమణారెడ్డి జెడ్ పి టి సి గిరి బోయిన భాగ్యలక్ష్మి ఎంపీపీ నాగలక్ష్మి స్థానిక సర్పంచ్ పర్వతం మధు ప్రసాద్ బచ్చన్నపేట సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి పి ఎస్ సి ఎస్ డైరెక్టర్లు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు గుర్రపు బాలరాజు గిరి బోయిన అంజయ్య అజీమ్ గంధ మల్ల నరేందర్ జిల్లెల్ల మహేందర్ రెడ్డి ఫెరోజ్ సిద్ది రామ్ రెడ్డి కైసర్ తదితరులు పాల్గొన్నారు