కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధర పెంపు పై బిఆర్ఎస్ శ్రేణుల నిరసన

జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు కొల్చారం మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్లు పక్కనపెట్టి కట్టెల పొయ్యి పై వంట చేస్తూ నిరసన తెలిపారు కేంద్ర ప్రభుత్వం సామాన్యుని బతకలేని స్థితికి తీసుకొచ్చారని 400 ఉన్న సిలిండర్ 1200 చేసి నిరుపేదలను ఇబ్బంది పెడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సావిత్రి రెడ్డి  కొల్చారం సర్పంచ్ ఉమారాణి రాజా గౌడ్  కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి బిఆర్ఎస్ (సంతోష్ కుమార్) (గజిని) వెంకట్ గౌడ్  పీస్ నర్సింలు తలారి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు